YS Jagan నివాసంలో గోశాల ఏర్పాటు.. వైసీపీ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో చర్చ
ABN , First Publish Date - 2021-11-29T18:06:31+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో గోశాల ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి 6 గోవులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీసుకొచ్చారు. ఆ గోవులకు జగన్ సతీమణి వైఎస్ భారతి పూజచేసి గోశాలకు తరలించినట్టు అనధికారిక సమాచారం. అయితే.. సడన్గా గోశాల ఏర్పాటుపై వైసీపీ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.