గంభీర్, అఫ్రిదీలు సోషల్మీడియాలో తెలివిగా ప్రవర్తించాలి: వకార్ యూనిస్
ABN , First Publish Date - 2020-06-01T21:46:03+05:30 IST
టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్, పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ మధ్య సోషల్మీడియాలో వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత
టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్, పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ మధ్య సోషల్మీడియాలో వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఓ కార్యక్రమంలో అఫ్రిదీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కశ్మీర్ ప్రజలను ఉద్ధేశించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై గంభీర్ అతనిపై మండిపడ్డారు. వీరిద్దరి మధ్య సోషల్మీడియాలో మాటల యుద్ధం జరిగింది.
అయితే సోషల్మీడియాలో గంభీర్, అఫ్రిదీలు కాస్త తెలివిగా ప్రవర్తించాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సూచించారు. ‘‘అఫ్రిదీ, గంభీర్ మధ్య చాలాకాలంగా గొడవ జరుగుతుంది. వాళ్లిద్దరు తెలివిగా, ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నాను. ఈ గొడవ చాలాదూరం వెళ్తుంది. సోషల్మీడియాలో ప్రశాంతంగా ఉండలేకపోతే.. ఇద్దరు ఎక్కడైన కలుసుకొని గొడవను పరిష్కరించుకోవాలి. సోషల్మీడియాలో ఎంత చేసిన ప్రజలు చూసి నవ్వుకుంటారు. చివరి వాళ్లిద్దరు కాస్త తెలివితో ఉంటే బాగుండు అని వాళ్లు అనుకుంటారు.’’ అని యూనిస్ తెలిపారు.