బీజేపీ ఎంపీ గౌతం గంభీర్కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-25T16:24:42+05:30 IST
భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కొవిడ్-19 బారిన పడ్డారు....
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కొవిడ్-19 బారిన పడ్డారు. ఎంపీ గౌతమ్ గంభీర్ కు మంగళవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని గౌతమ్ గంభీర్ చెప్పారు. 2022 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్గా ఉన్నారు.తనకు కరోనా సోకినందున తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని గౌతమ్ సూచించారు. ‘‘నాకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించగా ఈరోజు నాకు కొవిడ్కు పాజిటివ్ అని తేలింది. నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షించుకోమని అభ్యర్థిస్తున్నాను. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని గంభీర్ మంగళవారం ట్విట్టర్లో తెలిపారు.
కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. గంభీర్ భారతదేశం తరపున 54 టెస్టులు, 147 ఓడీఐ మ్యాచ్ లు 37 టీ20లు ఆడారు. గంభీర్ వరుసగా 2007, 2011లో టీ20 ప్రపంచ కప్, 50-ఓవర్ ప్రపంచ కప్ గెలిచిన జట్లలో ఉన్నారు.