గౌతు శిరీషను కించపరచడం తగదు
ABN , First Publish Date - 2021-08-01T05:11:15+05:30 IST
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త గౌతు శిరీషను వ్యక్తిగతంగా కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియా సభ్యులు పోస్టులు పెట్టడాన్ని టీడీపీ మండల నాయకులు ఖండించారు.
వైసీపీ సోషల్ మీడియా ప్రతుల దహనం
వజ్రపుకొత్తూరు: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త గౌతు శిరీషను వ్యక్తిగతంగా కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియా సభ్యులు పోస్టులు పెట్టడాన్ని టీడీపీ మండల నాయకులు ఖండించారు. శనివారం పార్టీ మండలాధ్యక్షుడు సూ రాడ మోహనరావు, నాయకులు బి.శశిభూషణ్, కర్ని రమణ, సాంబమూర్తి, మరడ దుర్యోధనరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సరికాదన్నారు. అనంతరం వైసీపీ సోషల్మీడియా చేసిన విమర్శల ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉమామహేశ్వరరావు, దాసరి జేజేరావు, బైనపల్లి ఆనంద్, లైశెట్టి భీమారావు తదితరులు పాల్గొన్నారు.