గవర వీధి అంతా ఒక్క‘సారె’ కదిలింది
ABN , First Publish Date - 2021-12-05T06:04:29+05:30 IST
పట్టణంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం సాయంత్రం అమ్మవారికి సారెను సమర్పించారు.
నేత్రపర్వంగా గౌరమ్మ సారె సంబరం
నర్సీపట్నం, డిసెంబరు 4 : పట్టణంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం సాయంత్రం అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా గవర వీధిలోని గౌరీ పరమేశ్వరుల ఆలయం నుంచి మెయిన్ రోడ్డు, సబ్ కలెక్టర్ కార్యాలయం, అబీద్ సెంటర్ మీదుగా పెద్ద సంఖ్యలో మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన లడ్డూలు, అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, మైసూరుపాకాలు, జాంగ్రీలు తదితర పండి వంటలను పళ్లేల్లో పేర్చి అమ్మవారికి నైవేథ్యంగా సమర్పించేందుకు ఊరేగింపుగా బయల్దేరారు. ముందుగా మేళతాళాలు, బాజా భజంత్రీలు వెళ్లగా, ఆ వెనుక వీరంతా ముందుకు సాగారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి నిమజ్జనం చేశారు. గౌరీ పరమేశ్వరుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు.