పంత్ టీమిండియాకు సారథ్యం వహిస్తాడు: గవాస్కర్

ABN , First Publish Date - 2021-05-13T20:01:58+05:30 IST

యువ ఆటగాడు రిషభ్ పంత్ భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహిస్తాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు

పంత్ టీమిండియాకు సారథ్యం వహిస్తాడు: గవాస్కర్

యువ ఆటగాడు రిషభ్ పంత్ భవిష్యత్తులో టీమిండియాకు నాయకత్వం వహిస్తాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. పంత్‌ ఏదైనా త్వరగా నేర్చుకుంటాడని, అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. జట్టును గెలిపించాలనే తపన అతడిలో ఎక్కువ కనబడుతుందని అన్నాడు. 


`ఐపీఎల్‌లో పంత్ సారథ్యంలో ఢిల్లీ నిలబడగలిగింది. ఆరంభంలో పంత్ కొన్ని తప్పులు చేశాడు. కానీ, వాటి నుంచి త్వరగా గుణపాఠాలు నేర్చుకున్నాడు. జట్టును విజయపథంలో నడిపించేందుకు అవసరమైన దారులను కనుగొన్నాడు. పంత్ టీమిండియా భవిష్యత్తు సారథుల్లో ఒకడు. అందులో సందేహం లేదు. అవకాశం వచ్చినపుడు దానిని సద్వినియోగం చేసుకునే లక్షణం అతడికి ఉంద`ని గవాస్కర్ చెప్పాడు. 

Updated Date - 2021-05-13T20:01:58+05:30 IST