జీడీపీ వృద్ధి 3 శాతం లోపే: కేపీఎంజీ

ABN , First Publish Date - 2020-04-07T05:49:43+05:30 IST

కరోనా వైరస్‌ మరింత విజృంభించి ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటే, భారత్‌కు మరిన్ని తిప్పలు తప్పవనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో...

జీడీపీ వృద్ధి 3 శాతం లోపే: కేపీఎంజీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మరింత విజృంభించి ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటే, భారత్‌కు మరిన్ని తిప్పలు తప్పవనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత  జీడీపీ వృద్ధి రేటు మూడు శాతం దిగువకూ పడిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ హెచ్చరించింది. అదే ఈ నెలాఖరు లేదా మే 15 నాటికి కరోనా విజృంభణ తగ్గితే వృద్ధి రేటు 5.3 నుంచి 5.7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఇది సుదూర స్వప్పంగానే కనిపిస్తోందని తెలిపింది. ఒకవేళ భారత్‌ కరోనా వ్యాప్తిని కట్టడి చేసినా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నా వృద్ధి రేటు 4 నుంచి 4.5 శాతం మించక పోవచ్చని పేర్కొంది.


Updated Date - 2020-04-07T05:49:43+05:30 IST