జీనోమ్‌ వ్యాలీలో ఐఐఎల్‌ కొత్త యూనిట్‌

ABN , First Publish Date - 2020-11-26T08:02:29+05:30 IST

హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో ఇండియన్‌ ఇమ్యూ నోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) వైరల్‌ యాంటీజెన్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ కంపెనీ వ్యాక్సిన్‌ ఉత్పత్తి

జీనోమ్‌ వ్యాలీలో ఐఐఎల్‌ కొత్త యూనిట్‌

రూ.75 కోట్ల పెట్టుబడి


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో ఇండియన్‌ ఇమ్యూ నోలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) వైరల్‌ యాంటీజెన్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ కంపెనీ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. డెంగ్యూ, జీకా తదితర వివిధ రకాల వ్యాక్సిన్లను తయారు చేయడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఐఎల్‌ ఎండీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఐఐఎల్‌ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కూడా ఈ యూనిట్‌లో తయారు చేస్తారు. గత ఏడాదిలో రూ.75 కోట్లతో ఏర్పాటు చేసిన స్టెరైల్‌ ఫిల్లింగ్‌ యూనిట్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌ ‘అభ్యర్యాబ్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుంది.  

Updated Date - 2020-11-26T08:02:29+05:30 IST