ఓటర్ల జాబితా సవరణకు సిద్ధంకండి

ABN , First Publish Date - 2021-10-28T04:38:53+05:30 IST

ఓటర్ల జాబితా సవరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని

ఓటర్ల జాబితా సవరణకు సిద్ధంకండి
సమావేశంలో మాట్లాడుతున్న శశాంక్‌ గోయల్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఓటర్ల జాబితా సవరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ జిల్లా అధికారులను ఆదే శించారు. 2022 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి బుధవారం ఆయన జిల్లా కలె క్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సం బంధించి  సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్లుగా నమోదు చేయాల న్నారు. అలాగే ఓటర్ల తొలగింపు, మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను నవంబర్‌ 1వ తేదీ నాటికి పూర్తిచేసి ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాలని సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని,  ఓటర్ల జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫొటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి సరి చేయాలన్నారు. ఓటర్ల జాబితాపై అభ్యం తరాలను పరిష్క రించి 2022 జనవరి 5వ తేదీ ఓటరు తుది జాబితాను ప్రచురించాలని సూచించారు. జనవరి1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యువతీ యువకులను ఓట ర్లుగా చేర్పించాల న్నారు.  గత ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల బిల్లులు, డీసీ బిల్లులు పెండింగ్‌ ఉంటే సత్వరమే దాఖలు చేయా లని తెలిపారు. సమావేశంలో జిల్లా అద నపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ద్వారా ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు, పేరు మార్పుకు వచ్చిన దర ఖాస్తులన్నీ పరిష్కరించి నవంబర్‌ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫెరెన్స్‌లో డీఆర్వో హరిప్రియ, జడ్పీ సీఈఓ దిలీప్‌ కుమార్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-28T04:38:53+05:30 IST