ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ
ABN , First Publish Date - 2022-01-15T06:01:38+05:30 IST
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కోరుట్ల అయ్యప్ప దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.
కోరుట్ల, జనవరి 14 : మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని కోరుట్ల అయ్యప్ప దేవాలయంలో మహా పడిపూజ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వేదపండి తులు పాలెపు రాంశర్మ మత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం చేపట్టారు. అయ్యప్ప మాల దారులు ఇరుముడి ధరించి స్వామి వారికి నెయ్యాబిషేకం చేసా రు. అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య స్వాముల ఉత్సవ విగ్రహాలతో పాటు మూల విరాట్కు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం మహాపడి పూజ నిర్వహిం చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణు గోపాల్ దంపతులు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సి లర్లు గణేష్, నరేష్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అబంటి శ్రీనివాస్, శాశ్వత దేవాలయ అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు.