ఘనంగా దుర్గాదేవి శోభాయాత్ర
ABN , First Publish Date - 2021-10-18T03:42:28+05:30 IST
నస్పూర్ మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీలక్ష్మి గణపతి అవ రణలో తొమ్మిది రోజులు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం సాయం త్రం ఘనంగా జరిగింది. వాహనాన్ని విద్యుత్ దీపా లతో అలంకరించారు. ఆలయం నుంచి పురవీధుల గుండా ఊరేగింపు సాగింది.
నస్పూర్, అక్టోబరు 17: నస్పూర్ మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీలక్ష్మి గణపతి అవ రణలో తొమ్మిది రోజులు పూజలందుకున్న దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ఆదివారం సాయం త్రం ఘనంగా జరిగింది. వాహనాన్ని విద్యుత్ దీపా లతో అలంకరించారు. ఆలయం నుంచి పురవీధుల గుండా ఊరేగింపు సాగింది. డప్పుచప్పుళ్ళు, బాణ సంచా పేలుళ్ళతో కుంకుమ చల్లుకుంటూ ఆనందోత్స వాల మధ్య భక్తులు పాల్గొన్నారు. నిర్వాహకులు అమ్మవారి విగ్రహాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతి రావు, ప్రధానార్చకులు గంగారపు వంశీకృష్ణ శర్మ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.