ఘనంగా కట్టమైసమ్మ పల్లకీసేవ
ABN , First Publish Date - 2022-01-24T05:09:43+05:30 IST
ఘనంగా కట్టమైసమ్మ పల్లకీసేవ
తాండూరు/ధారూరు, జనవరి 23 : తాండూరు పట్టణం గుమాస్తానగర్లో కట్టమైసమ్మ అమ్మవారి బోనాలను కాలనీవాసులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5గంటలకు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి, పల్లకీసేవ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం కాలనీవాసులతోపాటు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో కాలనీవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాల జాతర నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
- మైసమ్మ జాతరలో ఎమ్మెల్యే
ధారూరు మండల పరిధిలోని హరిదాసుపల్లి గ్రామంలో జరుగుతున్న మైసమ్మ జాతరలో భాగంగా ఆదివారం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.