ఘనంగా ముదిరాజ్‌ మహాసభ శత జయంతి

ABN , First Publish Date - 2021-10-25T05:48:39+05:30 IST

ముదిరాజ్‌ మహాసభ సంఘం స్థాపిం చి వందేళ్లు పూర్తైన సందర్భంగా ముదిరాజ్‌ మహాసభ జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో సంఘ శత జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య ఆధ్వర్యంలో స్థానిక గెస్ట్‌హౌజ్‌లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ముదిరాజ్‌ మహాసభ శత జయంతి
ముదిరాజ్‌ మహాసభ నిర్మాతలకు నివాళులు అర్పిస్తున్న సభ్యులు

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 24: ముదిరాజ్‌ మహాసభ సంఘం స్థాపిం చి వందేళ్లు పూర్తైన సందర్భంగా ముదిరాజ్‌ మహాసభ జిల్లా శాఖ ఆధ్వ ర్యంలో సంఘ శత జయంతి వేడుకలను జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య ఆధ్వర్యంలో స్థానిక గెస్ట్‌హౌజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా నర్సయ్య మాట్లాడుతూ ముదిరాజ్‌ కులస్తులు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదిగే విధంగా ముందుకు సాగాలని, ముదిరాజ్‌ సోదరుల ఐక్య తతోనే హక్కుల సాధన సాధ్యం అవుతుందన్నారు. ముదిరాజ్‌ల ఐక్యతే లక్ష్యంగా వచ్చే డిసెంబర్‌లో ముదిరాజ్‌ మహా ప్రభంజనం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉత్తం మహేష్‌, మెడవేణి వేణు, జిల్లా యూత్‌ అధ్యక్షుడు కొలకాని జలంధర్‌, అధికార ప్రతినిఽధి భూమి రమణ కుమార్‌, ఇన్‌చార్జ్‌ మర్రి విజయ్‌, పట్టణ, మండల అధ్య క్షులు జిట్టవేణి అరుణ్‌కుమార్‌, జలంధర్‌, నాయకులు రవి, అశోక్‌, దేవ రాజన్‌, గంగాధర్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-10-25T05:48:39+05:30 IST