ఘరానా దొంగ అరెస్ట్

ABN , First Publish Date - 2021-03-18T00:22:59+05:30 IST

నగరంలో పేరు మోసిన ఘరానా దొంగను కేపీహెచ్‌బీ పోలీసులు

ఘరానా దొంగ అరెస్ట్

 హైదరాబాద్: నగరంలో పేరు మోసిన ఘరానా దొంగను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ అయాజ్ అహ్మద్ అనే దొంగ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. దీంతో కాలనీలలో పోలీస్ గస్తీ పెంచామన్నారు. అయాజ్ పై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నామన్నారు. ధర్మారెడ్డి కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నం. 1లోని రెండు ఇళ్ళలో అయాజ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయాజ్ నుంచి ద్విచక్ర వాహనం, 63 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో మూడు కమిషనరేట్ల పరిధులలో 87 కేసుల్లో అయాజ్ జైలుకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-18T00:22:59+05:30 IST