ఇంటి ఖర్చుల కోసం పసివాడి విక్రయం... పోలీసుల జోక్యంతో నిజం వెల్లడి!
ABN , First Publish Date - 2021-05-17T12:46:23+05:30 IST
యూపీలోని గజియాబాద్లోగల డాబర్ తలాబ్ కాలనీలో...
గజియాబాద్: యూపీలోని గజియాబాద్లోగల డాబర్ తలాబ్ కాలనీలో 14 రోజుల చిన్నారిని అపహరించిన కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఇంటి ఖర్చుల కోసం ఒక జంట తమ బిడ్డను విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. యాచన చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ జంట మూడేళ్ల క్రితం కూడా తమ కుమారుడిని లక్ష రూపాయలకు విక్రయించారు. ఆ పిల్లవాడిని కొన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లోనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాబర్ చెరువు ప్రాంతానికి చెందిన ఒక జంట తమ 14 రోజుల శిశువును విక్రయించారు. అయితే దీనిపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు తమ 14 రోజుల శిశువును ఎవరో అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై బాధితులు రకరకాలుగా చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని విచారించారు. ఈ నేపధ్యంలో ఒక జంట బాధితుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. తరువాత వారు రెండు పెద్ద సంచులతో బయటకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు ఆ శిశువు తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తమ ఇంటి ఖర్చుల కోసం పిల్లవాడిని విక్రయించినట్లు అతను పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.