సమస్త సమాచారం ఒకేచోట..!

ABN , First Publish Date - 2021-01-19T13:22:57+05:30 IST

గ్రేటర్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట క్రోడికరించేలా కసరత్తు జరుగుతోంది. ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంత మంది ఉంటున్నారు. మురికివాడలెన్ని.. వంటి పౌర సంబంధ వివరాలతోపాటు, రహదారులు, తాగునీటి సరఫరా, మురుగు ...

సమస్త సమాచారం ఒకేచోట..!

జీహెచ్‌ఎంసీలో అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ సెల్‌

ప్రత్యేక విభాగం దిశగా అడుగులు

పట్టణ ప్రణాళిక, ఐటీ, ఎకనామిక్స్‌ 

అండ్‌ స్టాటిస్టికల్‌ విభాగాల సమన్వయం

పౌర సంబంధిత వివరాల నుంచి..మౌలిక సదుపాయాల వరకు

నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం 


హైదరాబాద్‌: గ్రేటర్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట క్రోడికరించేలా కసరత్తు జరుగుతోంది. ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంత మంది ఉంటున్నారు. మురికివాడలెన్ని.. వంటి పౌర సంబంధ వివరాలతోపాటు, రహదారులు, తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ తదితర మౌలిక సదుపాయాల సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. పూర్తి వివరాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌  చేసేలా చర్యలు తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీలో అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పేరిట అన్ని వివరాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఐటీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఈ సెల్‌ పని చేస్తుంది. బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారికి ఈ సెల్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నెల రోజుల్లో విభాగం ఏర్పాటు పూర్తవుతుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-19T13:22:57+05:30 IST