పాము కలకలం
ABN , First Publish Date - 2021-03-01T07:23:26+05:30 IST
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట
కవాడిగూడ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం పాము కలకలం రేపింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, రోడ్డుపైకి వచ్చిన నాగుపామును చూసి వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వాహనాలు కొద్దిసేపు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం నెలకొంది. పామును చూసేందుకు స్థానికులు, వాహనదారులు పోటీపడ్డారు. ట్రాఫిక్ పోలీసులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పామును పట్టుకుని వెళ్లారు.