బీజేపీ అభ్యర్థి ఇంటి ముందు టపాసులు కాల్చిన టీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , First Publish Date - 2020-12-05T14:46:59+05:30 IST

శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్‌ నాయకులు

బీజేపీ అభ్యర్థి ఇంటి ముందు టపాసులు కాల్చిన టీఆర్‌ఎస్‌ నాయకులు

హైదరాబాద్/బౌద్ధనగర్‌ : సీతాఫల్‌మండి డివిజన్‌ మధురానగర్‌కాలనీలో బౌద్ధనగర్‌ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి మేకల కీర్తి ఇంటి ముందు శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్‌ నాయకులు టపాసులు కాల్చటంతో కొద్దిసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. బౌద్ధనగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందిశైలజ సమీప బీజేపీ అభ్యర్థి మేకల కీర్తిపై 815 ఓట్ల మోజార్టీతో గెలిచారు. దీంతో కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు, యువకులు టపాసులు, మందుగుండును బీజేపీ అభ్యర్థి కీర్తి ఇంటిముందు అంటించారు.


దీంతో ఈ ప్రాంతం ఆందోళనకరంగా మారింది. విషయం తెలుసుకున్న చిలకలగూడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి బందోబస్తుతో వచ్చారు. టీఆర్‌ఎస్‌ యువకులను అక్కడ నుంచి వెళ్లగొట్టారు. ఈప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. గెలుపోటములు సహజమని, తమ ఇంటి ముందుకు టపాసులు కాల్చి హంగామా చే యటం మంచి పద్ధతికాదని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత సారంగపాణి తెలిపారు.

Updated Date - 2020-12-05T14:46:59+05:30 IST