సుజనా ఫోరమ్, జీవీకే మాల్స్కు జీహెచ్ఎంసీ భారీ జరిమానా
ABN , First Publish Date - 2020-09-23T19:55:49+05:30 IST
నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులపై జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.
హైదరాబాద్: నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులపై జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులకు భారీ జరిమానాలు విధిస్తోంది. తాజాగా కూకట్పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్కు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 4 లక్షల జరిమానా విధించారు. దీంతో సుజనా మాల్స్కు మొత్తంగా ఇప్పటి వరకు 16 లక్షల 50వేల జరిమానా విధించినట్లు అయింది. అలాగే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కు రూ. 2 లక్షలు, బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్కు రెండు లక్షల జరిమానా విధించారు.