టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
ABN , First Publish Date - 2020-12-04T20:50:11+05:30 IST
టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్..
హైదరాబాద్: టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. టీఆర్ఎస్ 70 స్థానాల్లో.. బీజేపీ 35, కాంగ్రెస్ 3, ఎంఐఎం 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. టీడీపీ ఇంతవరకు ఖాతా తెరవలేదు. గతంలో బీజేపీ నాలుగు స్థానాలు సాధించగా.. ఇపుడు ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా బీజేపీకి ఇది ‘సెలబ్రేషన్ టైమ్ సెలబ్రేషన్ మోడ్’ అని చెప్పవచ్చు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇచ్చారు.
మరోవైపు టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. డ్యాన్సులు వేస్తూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.