Hyderabad: 1570 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-27T16:28:05+05:30 IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులతో పోల్చితే బుధవారం కరోనా కేసుల సంఖ్య స్పల్పంగా పెరిగింది. తాజాగా 1570 నమోదయ్యాయి...

Hyderabad: 1570 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులతో పోల్చితే బుధవారం కరోనా కేసుల సంఖ్య స్పల్పంగా పెరిగింది. తాజాగా 1570 నమోదయ్యాయి. నగరంలో జలుబు జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అనుమానితులు, కరోనా సోకిన వారికి ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు పరీక్షల కోసం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.  


కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే

జలుబు, జ్వరంతో పాటు కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న జ్వర సర్వేలో 789 బృందాలు పాలుపంచుకున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో బుధవారం 44,016 ఇళ్లల్లో సర్వే చేసి లక్షణాలున్న 1849 మందిని గుర్తించి వారికి కిట్లను పంపిణీ చేశాయి. 


కూకట్‌పల్లిలో 150

కూకట్‌పల్లి ప్రాంతంలో బుధవారం 902 కరోనా పరీక్షలు నిర్వహించగా, వాటిల్లో 150 మందికి పాజిటీవ్‌ వచ్చింది. 

కుత్బుల్లాపూర్‌లో 66 

కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని నాలుగు యూపీహెచ్‌సీలతో పాటు దుండిగల్‌ పీహెచ్‌సీలో బుధవారం 413 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 66 మందికి పాజిటివ్‌గా తేలింది. 

Updated Date - 2022-01-27T16:28:05+05:30 IST