జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-19T09:24:21+05:30 IST
మానసిక ఇబ్బందులతో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది
బంజారాహిల్స్, సెప్టెంబర్18(ఆంధ్రజ్యోతి): మానసిక ఇబ్బందులతో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డునెంబర్-7 దేవరకొండబస్తీకి చెందిన రేణుక (40)జీహెచ్ ఎంసీలో పారిశుధ్య కార్మికురాలు. భర్త చనిపోగా కుమారుడు గణే్షతో కలిసి ఉంటోంది. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గురువారం గణేశ్ పనిపై బయటకెళ్లి అర్ధరాత్రి తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఎంత కొట్టినా అతడి తల్లి తలుపులు తీయలేదు. పక్కనే ఉన్న కిటికి నుంచి చూడగా ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సహాయంతో తలుపులు బద్ధలుకొట్టి ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మరణించింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.