వరంగల్ ఎంజీఎంలో ఘోరం

ABN , First Publish Date - 2020-08-10T00:02:10+05:30 IST

వరంగల్ ఎంజీఎంలో ఘోరం

వరంగల్ ఎంజీఎంలో ఘోరం

వరంగల్: వరంగల్ ఎంజీఎంలో ఘోరం జరిగింది. కోవిడ్ వార్డులో శవజాగారం జరుగుతోందని, పట్టించుకునే నాథుడు లేక ఎక్కడి శవాలు అక్కడే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ వార్డులో వైద్యులు, సిబ్బంది కన్పించడం లేదని, కోవిడ్ రోగులపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని సిబ్బంది కిందపడేశారని, బెడ్ పై మరో వృద్ధురాలి శవం ఉందని, కోవిడ్ వార్డులో వెంటిలేటర్లు, వసతులు ఎక్కడా చూసినా కన్పించవని రోగులు చెబుతున్నారు. మంత్రి ఈటల సమీక్ష తర్వాత కూడా ఎంజీఎంలో పరిస్థితులు మారలేదు. ఈ విషయాలన్నిటినీ ఏబీఎన్ వెలుగులోకి తెచ్చింది.

Updated Date - 2020-08-10T00:02:10+05:30 IST