బాలుడి అదృశ్యం.. మేనమామపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి

ABN , First Publish Date - 2020-09-20T14:40:31+05:30 IST

మండలంలోని గొరిజవోలు గ్రామానికి చెందిన దావల యశ్వంత్‌(8) ఈ నెల 17వ..

బాలుడి అదృశ్యం.. మేనమామపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి

నాదెండ్ల(గుంటూరు): మండలంలోని గొరిజవోలు గ్రామానికి చెందిన దావల యశ్వంత్‌(8) ఈ నెల 17వ తేదీ రాత్రి నుంచి అదృశ్యమయ్యాడు. తన మేనమామ వీరాస్వామి తన కుమారుడిని ఏదైనా చేసి ఉంటాడనే అనుమానంతో తల్లి దావల లక్ష్మి పోలీసులకు ఫిర్యాలు చేసింది. సేకరించిన వివరాల ప్రకారం ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన లక్ష్మి పాలపాడుకు చెందిన నాగేశ్వర్‌బాబును ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. సుమారు రెండేళ్లక్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మేనమామ పల్లపు వీరాస్వామి ఆమెను గొరిజవోలుకు తీసుకువచ్చాడు.


17వ తేదీ రాత్రి నుంచి కుమారుడు యశ్వంత్‌ అదృశ్యం కాగా ఆ మరుసటి రోజు నుంచి వీరాస్వామి కూడా కనిపించకుండా పోయాడు. దీనితో శుక్రవారం రాత్రి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరాస్వామి ఆ బాలుడిని హత్యచేసి గోనెసంచిలో తీసుకువెళ్లాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రూరల్‌ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐలు బాలకృష్ణ, నారాయణరెడ్డి మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-09-20T14:40:31+05:30 IST