వివాహితపై యువకుడు అత్యాచారం

ABN , First Publish Date - 2021-08-02T06:26:14+05:30 IST

వివాహితపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన గుడివాడలో ఆదివారం వెలుగుచూసింది. టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని నాగన్న చెరువు సమీపంలో నివాసం ఉండే యువతి (19) విజయవాడకు చెందిన ఓ యువకుడ్ని వివాహం చేసుకుంది.

వివాహితపై యువకుడు అత్యాచారం

గుడివాడ (రాజేంద్రనగర్‌), ఆగస్టు 1 : వివాహితపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన  గుడివాడలో ఆదివారం వెలుగుచూసింది. టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని నాగన్న చెరువు సమీపంలో నివాసం ఉండే యువతి (19) విజయవాడకు చెందిన ఓ యువకుడ్ని వివాహం చేసుకుంది. ఆమె ఆషాఢ మాసం కావడంతో నాగన్న చెరువులోని పుట్టింటికి వచ్చింది. ఇంట్లో ఆమె ఒక్కరే ఉండటం గమనించిన స్థానిక యువకుడు ఫణి కుమార్‌ మంచినీళ్లు కావాలని ఆమెను అడిగాడు. ఆమెతో ఇంట్లోకి ప్రవేశించి వెనుక నుంచి ఆమెపై పడి అత్యాచారం చేశాడు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్‌ సీఐ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-08-02T06:26:14+05:30 IST