కూతురిపై సవతి తల్లి దారుణం

ABN , First Publish Date - 2020-02-21T14:09:28+05:30 IST

ఓ బాలికను సవతి తల్లి దారుణంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహ పట్టణంలో వెలుగుచూసింది....

కూతురిపై సవతి తల్లి దారుణం

అమ్రోహ (ఉత్తరప్రదేశ్): ఓ బాలికను సవతి తల్లి దారుణంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహ పట్టణంలో వెలుగుచూసింది. అమ్రోహ పట్టణానికి చెందిన సానియా అనే బాలికను సవతి తల్లి దారుణంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన సానియాను అమ్రోహ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సానియాకు సవతి తల్లి చిత్రహింసలు పెట్టడం వల్ల తీవ్రంగా గాయపడిందని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ ఇక్బాల్ చెప్పారు. తనను సవతి తల్లి చాలా ఏళ్లుగా కొడుతుందని, తాను ఇకముందు ఆమెతో కలిసి ఉండలేనని సానియా ఆవేదనగా చెప్పింది. బాలికను హింసించిన సవతితల్లిని శిక్షించాలని సానియా పొరుగింటి వ్యక్తి బబ్లూఖాన్ డిమాండ్ చేశారు. సానియాను ఆమె సవతితల్లి కర్రలు, లాఠీలతో దారుణంగా కొట్టిందని పొరుగింటి వ్యక్తులు చెప్పారు.

Updated Date - 2020-02-21T14:09:28+05:30 IST