చీకటి పడుతున్న వేళ.. ఆమె స్థానికుల సాయంతో డెయిరీ బూత్ షట్టర్ తెరిచింది.. లోపల కుమార్తెను అటువంటి స్థితిలో చూసి షాకయ్యింది!

ABN , First Publish Date - 2021-10-30T15:28:04+05:30 IST

రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలో గల చమన్‌పురాలోని..

చీకటి పడుతున్న వేళ.. ఆమె స్థానికుల సాయంతో డెయిరీ బూత్ షట్టర్ తెరిచింది.. లోపల కుమార్తెను అటువంటి స్థితిలో చూసి షాకయ్యింది!

రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలో గల చమన్‌పురాలోని ఒక డెయిరీ బూత్‌లో ప్రేమికుల జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతి డెయిరీ నిర్వాహకుని కుమార్తె. ఆ యువకుడు మాండ్లా గ్రామనివాసి. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకున్న జనం సంఘటనా స్థలంలో గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఉరితాడుకు వేలాడుతున్న మృతదేహాలను కిందకు దించి మార్చురీకి తరలించారు. బనెడా పోలీస్ స్టేషన్ అధికారి నంద్ లాల్ రిణ్వా తెలిపిన వివరాల ప్రకారం చమన్‌పూర్‌లో శంకర్ సింగ్ రావణ్ డెయిరీ నడిపేవారు. 


ఏడాది క్రితం అతను మృతి చెందడంతో, అతని భార్య పుష్పాదేవి ఆ డెయిరీ పనులు పర్యవేక్షిస్తున్నారు.  రోజూ మాదిరిగానే ఆమె మధ్యాహ్నం వేళ వంట వండేందుకు ఇంటికి వెళ్లి, సాయంత్రం ఏడు గంటలకు తిరిగి డెయిరీ బూత్ దగ్గరకు వచ్చింది. డెయిరీ షట్టర్ లోపల లాక్ అయి ఉండటంతో స్థానికుల సహాయంతో దానిని తెరిపించి, లోపలి దృశ్యం చూసి షాకయ్యింది. లోపల తన కుమార్తెతో పాటు మరో యువకుడు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను పూజ(20) సురేష్(23)లుగా గుర్తించారు. వెంటనే పోలీసులు మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించారు. వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-10-30T15:28:04+05:30 IST