కుంటలో పడి బాలిక మృతి

ABN , First Publish Date - 2021-06-05T05:38:31+05:30 IST

ప్రమాదవశాత్తు కుంటలో పడి బాలిక మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని పుఠానితండాలో జరిగింది.

కుంటలో పడి బాలిక మృతి

రఘునాథపాలెం, జూన్‌ 4: ప్రమాదవశాత్తు కుంటలో పడి బాలిక మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని పుఠానితండాలో జరిగింది. ఎస్‌ఐ వరాల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన బానోత్‌ రాంబాబు కూతురు అఖిల(13), మనవడు గణే్‌ష్‌ మేకలు మేపటానికి గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ కుంట దగ్గరకు మేకలు నీళ్లకోసం వెళ్లాయి. వాటి వెంట వెళ్లిన గణేష్‌  ప్రమాదవశాత్తు కుంటలో పడ్డాడు. అతడిని కాపాడేందుకు అఖిల కుంటలోకి దిగింది. ఇద్దరు నీటిలో మునుగుతుండగా అక్కడే ఉన్న పలువురు ఇరువురిని బయటకు తీశారు. అయితే అప్పటికే అఖిల మృతిచెందగా, గణే్‌షను ఆసుపత్రికి తరలించారు.  


Updated Date - 2021-06-05T05:38:31+05:30 IST