మూడు ఆస్పత్రులు తిప్పినా దక్కని పాప ప్రాణం

ABN , First Publish Date - 2020-09-21T21:35:36+05:30 IST

మూడు ఆస్పత్రులు తిప్పినా తల్లిదండ్రులు పాపను కాపాడుకోలేక పోయారు.

మూడు ఆస్పత్రులు తిప్పినా దక్కని పాప ప్రాణం

నంద్యాల: మూడు ఆస్పత్రులు తిప్పినా తల్లిదండ్రులు పాపను కాపాడుకోలేక పోయారు. దీంతో గుండెలవిసేలా రోధించారు. నంద్యాల ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ పాప మృతి చెందిందని ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది తీరును బంధువులు, ప్రజా సంఘాల నేతలు నిరసించారు. బాలిక మృత దేహాంతో ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధితులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


కర్నూలు జిల్లా, ముత్యాలపాడు తండాలో నివాసం ఉండే మల్లికార్జున నాయక్, జ్యోతిభాయ్ దంపతుల తొమ్మిదేళ్ల భాలిక అఖిల భాయ్‌కు గతరాత్రి తేలు కుట్టింది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఆలగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. అయినా పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున నంద్యాలలోని ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వెంటనే చికిత్స అందించలేదని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని పాప తల్లిదండ్రులు ఆరోపించారు.

Updated Date - 2020-09-21T21:35:36+05:30 IST