బాలిక ఫొటోలు తీసి.. బెదిరించి..

ABN , First Publish Date - 2020-06-03T18:26:19+05:30 IST

బాలిక స్నానం చేస్తుండగా.. ఫొటోలు తీసి.. వాటిని చూపించి..

బాలిక ఫొటోలు తీసి.. బెదిరించి..

చీపురుపల్లి(విజయనగరం): బాలిక స్నానం చేస్తుండగా.. ఫొటోలు తీసి.. వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి, గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. అభం శుభం తెలియని 14 ఏళ్ల బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి కటకటాలపాయ్యాడు. బొబ్బిలి డీఎస్పీ జె.పాపారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చీపురుపల్లి పట్టణానికి చెందిన బాలికపై అదే ప్రాంతంలో ఉంటున్న చింతపల్లి రాజు గత కొంతకాలంగా కన్నేశాడు. ఎలాగైనా లోబరుచుకోవాలనుకున్నాడు. ఓ రోజు బాలిక స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడు. వాటిని చూపించి తన కోరిక తీర్చాలని.. లేని పక్షంలో ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించాడు. చివరకు ఆమెను వశబరుచుకుని గర్భవతిని చేశాడు. బాలిక ఆరోగ్య పరిస్థితులపై అనుమానం వచ్చిన ఆమె తల్లి.. తన బిడ్డకు వైద్య పరీక్షలు చేయించింది. దీంతో రెండు నెలల గర్భవతిగా తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-03T18:26:19+05:30 IST