స్కూలుకు వెళ్లనని మొండికేస్తున్న కూతురు.. అసలేమయిందని నిలదీస్తే ఆ బాలిక చెప్పింది విని నివ్వెరపోయిన తల్లి..!
ABN , First Publish Date - 2021-12-17T20:41:37+05:30 IST
ఆ బాలిక క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేది.. గురువారం ఉదయం మాత్రం పాఠశాలకు వెళ్లనని మొండికేసింది..
ఆ బాలిక క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేది.. గురువారం ఉదయం మాత్రం పాఠశాలకు వెళ్లనని మొండికేసింది.. తల్లిదండ్రులు ఎంతగా బతిమాలినా ఆ బాలిక స్కూలుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.. అసలేమయిందని నిలదీస్తే ఆ బాలిక షాకింగ్ విషయం చెప్పింది.. బుధవారం ఒక విద్యార్థి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది.. షాకైన తల్లి ఆ విషయాన్ని వెంటనే పాఠశాల యాజమాన్యానికి, పోలీసులకు చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని చందౌలిలో ఈ ఘటన జరిగింది.
కొత్వాలిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక గురువారం ఉదయం స్కూలుకు వెళ్లడానికి భయపడింది. తల్లిదండ్రులు ఎంతగా బతిమాలినా ఆ బాలిక స్కూలుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో విషయం ఏంటని ఆరా తీసిన తల్లికి ఆ బాలిక అసలు విషయం చెప్పింది. పాఠశాలలోని ఓ విద్యార్థి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది. షాకైన తల్లి ఆ విషయాన్ని వెంటనే పాఠశాల యజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.
ఆ విద్యార్థి స్కూలుకు రాలేదని చెప్పడంతో బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు పంపించారు. బాలిక చెబుతున్న విద్యార్థి కోసం గాలిస్తున్నారు. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై చెప్పారు.