ప్రియుడితో కలిసి ఊరొదిలి వెళ్లిపోతున్న ప్రేయసి.. బైక్‌పై వెళ్తుండగా చూసిన యువతి సోదరుడు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-16T21:01:23+05:30 IST

వారిద్దరూ ఒకే గ్రామంలోని పక్కపక్కన ఇళ్లలో ఉండే యువతీయువకులు. చిన్నప్పటి నుంచి ఏర్పడిన పరిచయం వల్ల ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఇంకొకరికి చచ్చేంత ఇష్టం ఏర్పడింది.

ప్రియుడితో కలిసి ఊరొదిలి వెళ్లిపోతున్న ప్రేయసి.. బైక్‌పై వెళ్తుండగా చూసిన యువతి సోదరుడు.. చివరకు ఏం జరిగిందంటే..

పాట్నా: వారిద్దరూ ఒకే గ్రామంలోని పక్కపక్కన ఇళ్లలో ఉండే యువతీయువకులు. చిన్నప్పటి నుంచి ఏర్పడిన పరిచయం వల్ల ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఇంకొకరికి చచ్చేంత ఇష్టం ఏర్పడింది. అయితే ఓ రోజు ప్రియుడితో కలిసి ఊరొదిలి వెళ్లిపోతున్న ఆమెను సోదరుడు చూశాడు. ఆ తర్వాత రోడ్డు మీద కొద్దిసేపు హైడ్రామా జరిగింది. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. అసలు విషయానికొస్తే..


పాట్నాలోని గౌరీచక్ ప్రాంతానికి చెందిన కల్పనా కుమారి, కౌశల్ కుమార్ ఒకరినొకరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి గురించి ఇంట్లో చెప్తే కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. అయినా వారిద్దరూ రహస్యంగా కలుసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రేయసి శుక్రవారం ప్రియుడిని దగ్గర్లో ఉన్న మార్కెట్‌కు రమ్మని చెప్పింది. అక్కడి నుంచి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రేమికులిద్దరూ యువతి సోదరుని కంట పడ్డారు. అతని స్నేహితులతో కలిసి వెళ్లి ప్రియుడిని చితకబాదారు. ప్రియురాలు అడ్డుకున్నా వారు ఆగకుండా కౌశల్‌పై దాడి చేశారు. అపుడు యువతి తను కౌశల్‌ని ప్రేమిస్తున్నానని, ఇందులో ఎవరికి కలగచేసుకునే హక్కు లేదని వారించింది. అయినా యువతి సోదరుడు వినిపించుకోకుండా యువకుడిని చితకబాది.. ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-10-16T21:01:23+05:30 IST