క్లాసులో పాఠాలు చెబుతున్న టీచర్.. అనుకోకుండా పైకి చూసి భయంతో కేకలు పెట్టిన విద్యార్థిని.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-16T22:02:21+05:30 IST

ఎప్పటిలాగానే ఆ రోజూ పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు క్లాస్‌లో టీచర్ చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటున్నారు..

క్లాసులో పాఠాలు చెబుతున్న టీచర్.. అనుకోకుండా పైకి చూసి భయంతో కేకలు పెట్టిన విద్యార్థిని.. అసలేం జరిగిందంటే..

ఎప్పటిలాగానే ఆ రోజూ పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు క్లాస్‌లో టీచర్ చెబుతున్న పాఠాలను శ్రద్ధగా వింటున్నారు.. అంతలో ఒక విద్యార్థిని అనుకోకుండా పైకి చూసింది.. అక్కడ ఏదో పాకుతున్నట్టు అనిపించింది.. ఓ భారీ కొండచిలువ కనిపించింది.. దీంతో ఆమె భయంతో కేకలు పెట్టింది.. ఆ దృశ్యం చూసి సహ విద్యార్థులందరూ బయటకు పారిపోయారు.. అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది దానిని పట్టుకున్నారు.. ఛత్తీష్‌గఢ్‌లోని పెండ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


పెండ్రా‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలోకి సోమవారం ఉదయం ఓ భారీ కొండ చిలువ ప్రవేశించింది. దానిని చూసిన ఓ విద్యార్థిని భయంతో కేకలు వేసింది. దీంతో విద్యార్థులందరూ తరగతి గది నుంచి బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు అటవీ సిబ్బందికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది కొన్ని గంటల శ్రమ అనంతరం కొండ చిలువను పట్టుకున్నారు. దానిని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. 





Updated Date - 2021-11-16T22:02:21+05:30 IST