పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 13 ఏళ్ల బాలిక.. టెన్షన్‌గా కనిపించడంతో ఏమైందమ్మా అని అడిగితే ఆ బాలిక చెప్పింది విన్న ఆ పోలీసులకు..

ABN , First Publish Date - 2021-10-28T03:14:39+05:30 IST

టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ 13 ఏళ్ల బాలికను చూసిన పోలీసులు ఏమైందమ్మా అని అడిగారు. కంగారుగా లోపలికి వచ్చిన ఆమె.. కాస్త స్థిమితపడ్డాక చెప్పిన విషయాలు విని పోలీసులు ఒక్కసారిగా షాకైపోయారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 13 ఏళ్ల బాలిక.. టెన్షన్‌గా కనిపించడంతో ఏమైందమ్మా అని అడిగితే ఆ బాలిక చెప్పింది విన్న ఆ పోలీసులకు..

ఇంటర్నెట్ డెస్క్: టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ 13 ఏళ్ల బాలికను చూసిన పోలీసులు ఏమైందమ్మా అని అడిగారు. కంగారుగా లోపలికి వచ్చిన ఆమె.. కాస్త స్థిమితపడ్డాక చెప్పిన విషయాలు విని పోలీసులు ఒక్కసారిగా షాకైపోయారు. తండ్రి ఓ యువకుడిని గడ్డపారతో పొడిచి చంపుతుండగా చూశానంటూ ఆమె చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం జరిగిందీ ఘటన.


కాగా.. బాలిక చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆమె తండ్రి కన్హయ్యా బసారియాను స్టేషన్‌కు తీసుకొచ్చారు. మొదట తాను ఎవరినీ చంపలేదని అతడు చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే..  కూతురిని ఎదురుగా నిలబెట్టి ప్రశ్నించడంతో చివరికి అతడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. మృతుడికి తనకు అంతకుముందు పరిచయం లేదని కన్హయ్య చెప్పడంతో వారు ఒక్కసారిగా షాకైయ్యారు. సోమవారం రాత్రి కన్హయ్య ఇంటికి వెళుతూ దారిలో బైక్‌పై వెళుతున్న అజేశ్ వర్మను లిఫ్ట్ అడిగాడు. ఆ తరువాత.. ఇద్దరూ కలిసి మరో ప్రాంతంలో మద్యం తాగారు. 


అయితే.. అజేష్ తనకు ఆకలేస్తోందని కన్హయ్యతో అనడంతో అతడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. భోజనాలు పూర్తయ్యాక వారి మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైంది. దీంతో..కన్హయ్య అప్పటికప్పుడు అజేష్‌ను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. అతడిని సమీపంలోని ఉన్న అడవిలోకి తీసుకెళ్లి గడ్డపారతో పొడిచి చంపేశాడు. ఈ దృశ్యాలన్నీ అతడి కూతురి కంటపడ్డాయి. కాగా.. కొంత కాలం క్రితమే కన్హయ్య భార్య చనిపోయింది. అతడు అప్పుడప్పుడూ కూతురిపై చేయిచేసుకుంటూనే ఉండేవాడు. హత్య చేసిన రోజు కూడా ఆమెను బెదిరించాడు. బాలిక ఈ విషయాన్ని గ్రామంలోని ఓ వ్యక్తికి చెప్పింది. అతడి సలహా మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.  

Updated Date - 2021-10-28T03:14:39+05:30 IST