కోత లేకుండా పెన్షన్ ఇవ్వండి
ABN , First Publish Date - 2020-04-05T09:15:33+05:30 IST
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఎలాంటి కోత లేకుండా మార్చి నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ
కడప (మారుతినగర్), ఏప్రిల్ 4 : ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఎలాంటి కోత లేకుండా మార్చి నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జంబారపు అహరోన్ సీఎం జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక గుంతబజారులోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరో నా వైరస్ ప్రభావం వల్ల జనజీవనం స్తంభించి పో యి న సంగతి తెలిసిందేనని, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ ఉద్యోగులందరికీ నెలవారి జీతాలలో ఎలాంటి కోత లేకుండా ఇచ్చేలా ఆదేశాలివ్వడం హర్షణీయమన్నారు.
ఉపాధి కోల్పోయిన వారికి చేయూత
కడప మారుతీనగర్: కరోనా వైరస్ మూ లంగా ఉపాధి కోల్పోయిన వారికి తమ పార్టీ అనుబంధ సంఘాలు చేయూతనిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బద్వేలు ప్రాంతంలో బియ్యం, కూరగాయల పంపిణీ, వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలలో కూడా అన్నదాన కార్యకమ్రాలు చేపడుతున్నామన్నారు.