సకాలంలో బ్యాంకు గ్యారంటీ ఇవ్వండి

ABN , First Publish Date - 2020-11-23T05:32:04+05:30 IST

రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన వరి పంట కోతకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో నూ ర్పులు కూడా జరుగుతున్నాయి

సకాలంలో బ్యాంకు గ్యారంటీ ఇవ్వండి


కొమరాడ, నవంబరు 22: రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన వరి పంట కోతకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో నూ ర్పులు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రభు త్వం కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉందని తహ సీల్దార్‌ ప్రసాద్‌ అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ మిల్ల ర్లు బ్యాంకు గ్యారంటీలు తీసుకుని  అందజేస్తే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని, రైతులకు సత్వరమే న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉప తహసీల్దార్‌ ఆవాల సూర్యనారాయణ, వ్యవ సాయాధికారి శంకరరావు, సీఎస్‌డీటీ నాగేశ్వరరావు, రైసు మిల్లర్ల ప్రతినిధి జి.ఉదయభాను, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-23T05:32:04+05:30 IST