పరిహారం ఇవ్వండి అయ్యా..

ABN , First Publish Date - 2021-02-25T06:18:54+05:30 IST

మండలంలోని పోన్కల్‌, కమల్‌కోట్‌, ఆదర్శనగర్‌ గ్రామాలకు చెందిన సదర్‌మాట్‌ భూ నిర్వాసితులు, బుధవారం మండల కేంద్రంలో అంగడిబజార్‌ నుండి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తూ, పరిహారం ఇవ్వాలని కోరుతూ వినాదాలు చేశారు.

పరిహారం ఇవ్వండి అయ్యా..
తహసీల్‌దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న భూనిర్వాసితులు

సదర్‌మాట్‌ భూ నిర్వాసితుల వినతి

మామడ, ఫిబ్రవరి 24 : మండలంలోని పోన్కల్‌, కమల్‌కోట్‌, ఆదర్శనగర్‌ గ్రామాలకు చెందిన సదర్‌మాట్‌ భూ నిర్వాసితులు, బుధవారం మండల కేంద్రంలో అంగడిబజార్‌ నుండి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తూ, పరిహారం ఇవ్వాలని కోరుతూ వినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీ కాంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు రోజులుగా నిరసన, రిలే నిరాహారదీక్ష చేస్తున్న ప్రభుత్వం గానీ, అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. భూ సమస్యలు పరి ష్కరించి నష్టపరిహరం ఇప్పించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు. 


Updated Date - 2021-02-25T06:18:54+05:30 IST