పొఫెసర్ సాయిబాబకు పెరోల్ ఇవ్వండి
ABN , First Publish Date - 2021-05-08T09:20:18+05:30 IST
మహారాష్ట్రలోని నాగ్పూర్ సెంట్రల్ జైలులో జీవితఖైదీగా ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వీల్చైర్కే పరిమితమయ్యారని, పెరోల్పై విడుదల చేయాలని
మహారాష్ట్ర హోంమంత్రికి సాయిబాబ సతీమణి వినతి
న్యూఢిల్లీ, మే7(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాగ్పూర్ సెంట్రల్ జైలులో జీవితఖైదీగా ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వీల్చైర్కే పరిమితమయ్యారని, పెరోల్పై విడుదల చేయాలని ఆయన సతీమణి వసంతకుమారి, సోదరుడు గోకరకొండ రామదేవుడు మహారాష్ట్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఇద్దరు సంరక్షకులను నియమించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర జైళ్లశాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ద్వారా నాగ్పూర్ సెంట్రల్ జైలు అధికారులను ఆదేశించాలని శుక్రవారం లేఖ రాశారు.