తొలి రోజే 21శాతం పెరిగిన గ్లాండ్‌ ఫార్మా షేరు

ABN , First Publish Date - 2020-11-21T07:53:38+05:30 IST

గ్లాండ్‌ ఫార్మా షేర్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో నమోదయ్యాయి. పబ్లిక్‌ ఇష్యూ ధరతో పోలిస్తే 14 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక్కో షేరును రూ.1,500కు కేటాయించగా..

తొలి రోజే 21శాతం పెరిగిన గ్లాండ్‌ ఫార్మా షేరు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్లాండ్‌ ఫార్మా షేర్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలలో నమోదయ్యాయి. పబ్లిక్‌ ఇష్యూ ధరతో పోలిస్తే 14 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఒక్కో షేరును రూ.1,500కు కేటాయించగా..  ఎన్‌ఎ్‌సఈలో రూ.1710 వద్ద, బీఎ్‌సఈలో రూ.1701 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. తొలి రోజే ఇష్యూ  ధరతో పోలిస్తే 21 శాతం పైగా పెరిగింది. బీఎ్‌సఈలో రూ.1,850 గరిష్ఠ స్థాయిని తాకిన షేరు చివరకు రూ.1,820.45 వద్ద ముగిసింది. 

Updated Date - 2020-11-21T07:53:38+05:30 IST