మ్యాక్స్వెల్ అర్ధ సెంచరీ.. కుదురుకుంటున్న వేళ పడిక్కల్ అవుట్
ABN , First Publish Date - 2021-04-18T22:03:11+05:30 IST
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన రాయల్
చెన్నై: కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కుదురుకుంది. గ్లెన్ మ్యాక్స్వెల్ రాకతో వికెట్ల పతనానికి ఫుల్స్టాప్ పడింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తోడుగా మ్యాక్స్వెల్ తన అనుభవాన్నంతా రంగరించి జట్టును ఆదుకున్నాడు. అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టును పట్టాలెక్కించాడు.
ఈ క్రమంలో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. మరోవైపు నెమ్మదిగా ఆడుతున్న పడిక్కల్ 95 పరుగుల వద్ద మూడో వికెట్గా వెనుదిరిగాడు. 28 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్ 25 పరుగులు మాత్రమే చేసి ప్రసీద్ బౌలింగ్లో త్రిపాఠీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిశాయి. ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. మ్యాక్స్వెల్ (61), డివిలియర్స్ (5) క్రీజులో ఉన్నారు.