అర్ధరాత్రి చిరుత అలజడి

ABN , First Publish Date - 2022-04-07T06:57:40+05:30 IST

మండలంలోని కాల్వతండా గ్రామశివారులో అర్ధరాత్రి పులి అలజడి సృష్టించింది.

అర్ధరాత్రి చిరుత అలజడి
చిరుత దాడి చేసింది ఈ మంద పైనే..

కాల్వ దేవస్థానం సమీపంలో గొర్రెలమందపై దాడి

దిలావర్‌పూర్‌, ఏప్రిల్‌ 6 : మండలంలోని కాల్వతండా గ్రామశివారులో అర్ధరాత్రి పులి అలజడి సృష్టించింది. గొర్రెల మందపై దాడి చేసిన ఒక గొర్రెను చంపి వేసింది. కాల్వలక్ష్మినరసింహస్వామి దేవస్థానం సమీ పంలో ఈ ఘనట చోటు చేసుకుంది. కాల్వ తండాకు చెందిన టీకాజీకి చెందిన పంటచేనులో గొర్రెల మంద ను పండుకో బెట్టారు. అర్ధరాత్రి ఒక్కసారిగా చిరుత గొర్రెల మందపై దాడి చేసింది. ఈ దాడిలో ఒక గొర్రె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. కాపలాగా ఉన్న కుక్క మొరగడంతో పాటు గొర్రెల అరుపులతో దూరం గా పడుకుంది. గొర్రెల కాపరి జాదవ శంకర్‌ మెలుకు వ వచ్చి చూడగా గొర్రెల మందలో చిరుతపులి ఉండ టాన్ని గమనించి ఆందోళనకు గురయ్యాడు. అలాగే దూరంగా వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నాడు. కుక్క అరుపులతో చిరుత పలాయనం చిత్తగించింది. మంద కు వెళ్లి చూడగా గొర్రె తీవ్రగాయాలతో మృతి చెంది ఉంది. చిరుత అలజడితో రైతులు తీవ్ర భయాందోళన కు గురవుతున్నారు. ఈ ఘటన కాల్వ దేవస్థానం సమీపంలోనే జరగడంతో భక్తులు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత పులిని పట్టుకుని రక్షణ కల్పించాలని ఇటు రైతులు, అటు నరసింహస్వామి 

Updated Date - 2022-04-07T06:57:40+05:30 IST