ఘనంగా జగ్జీవనరామ్ జయంతి
ABN , First Publish Date - 2022-04-06T05:10:38+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవనరామ్ జయంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించా రు. విగ్రహాలు, చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
(న్యూస్ నెట్వర్క్, ఆంధ్రజ్యోతి)
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవనరామ్ జయంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించా రు. విగ్రహాలు, చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవన వద్ద ఉన్న జగ్జీవనరామ్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. నాయకులు అంబికా లక్ష్మీనారాయ ణ, రామాంజనమ్మ, అంజనప్ప, రమేష్, నాగరాజు, పరిమళ, అమర్నాథ్, భాస్కర్, ప్రెస్ వెంకటేశ, హెచఎన రాము, సుమోశీన, సతీష్, కదిరప్ప, విజయలక్ష్మీ, శ్రీధర్, వెంకటరమణ పాల్గొన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఎమ్మె ల్సీ మహ్మద్ ఇక్బాల్, మున్సిపల్ చైర్పర్సన ఇంద్రజ, వైస్ చైర్మన జబీవుల్లా, మార్కెట్యార్డ్ చైర్మన మల్లికార్జున నివాళులర్పించారు. ఎస్టీయూ నాయకులు ప్రసాద్, గొబ్రేనాయక్, గోవిందప్ప, సమీవుల్లా, నారాయణస్వా మి, గంగాధర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. జగ జ్జీవనరాం జయంతి, టీడీపీ నాయకులు ప్రేమ్కుమార్ వర్ధంతి సందర్భంగా కౌన్సిలర్ సతీష్ అన్నదానం చేశారు. అనంతరం పరిగి బస్టాండు ఆవరణ లో ఆదిజాంబవంత డెవల్పమెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చ లివేంద్రాన్ని వనటౌన సీఐ ఇస్మాయిల్ ప్రారంభించారు. ఆయా కార్యక్రమా ల్లో టీడీపీ నాయకులు రమేష్, రామాంజినప్ప, హెచఎన రాము, భార్గవ్, శివ, ఎమ్ఎ్సఎఫ్ నాయకులు బాబి, మధు, మేళాపురం నాగన్న, ఎంఈఎఫ్ నాయకులు రామకృష్ణ, ఆంజినేయులు, బాబయ్య పాల్గొన్నారు.
పెనుకొండలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్నారాయణ జగ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులంచారు. అదేవిధంగా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ, ఫైనాన్సకమిటీ చైర్మన అంగడి రామాంజినేయులు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. అంబేడ్కర్నగర్లో దళిత సంఘం నాయకులు శ్రీనివాస్, గోవిం దు, ముత్యాలు, ఈశ్వర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో పెట్రోల్బంక్ వద్ద జగ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలువేసి, మిఠాయిలు పంచిపెట్టారు. పెనుకొండ రూరల్ మండలం కియ కంపెనీ ఎదుట హెచపీ పెట్రోల్ బంక్ వద్ద టీ డీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో జగ్జీవనరామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిన్నపోతన్న, లింగంనాయుడు, మా జీ సింగిల్విండో డైరెక్టర్ బూతప్ప, నాగభూషణం, ఓబులేసు పాల్గొన్నారు.
గోరంట్లలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బాబు జగ్జీవనరామ్ జయంతిని ఎంఈఎఫ్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కేక్కట్చేసి సంబరాలు చేసుకున్నారు. నాయకులు మధుసుదన, నాగేనాయక్, ఓబులేసు, ఎల్ఐసీ శీన, వానవోలు నారాయణ, సైకిల్ నరసింహులు, నారాయణ పాల్గొన్నారు. చిలమత్తూరులోని గ్రంథాలయ శాఖ కార్యాలయంలో గ్రంథాలయ కార్యదర్శి మ ల్లికార్జున ఆధ్వర్యంలో జగజ్జీవనరామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మధు, వడిత్య ప్రేమ్, తిప్పేస్వామి, రామాంజి, చౌడ ప్ప, గంగాధర్ పాల్గొన్నారు. సోమందేపల్లిలో సర్పంచలు గంగాదేవి, నరసింహులు, మాజీ ఎంపీపీ వెంకటేశులు, కిష్టప్ప, సూర్యనారాయణ, గంగాధర్, నరసింహమూర్తి ఆధ్వర్యంలో జగ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. రొద్దంలో నిర్వహించిన జగ్జీవనరామ్ వేడుకల్లో హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి నరసింహులు, ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ రూప, గోవిందు, సిద్దన్న, అశ్వర్థప్ప పాల్గొన్నారు. పావగడలో జగ్జీవనరామ్ జయంతిని తాలూకా కార్యాలయం, సాంఘిక సంక్షేమ శాఖ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ వరదరాజు, ఈఓ శివరాజయ్య పాల్గొన్నారు.
మడకశిర అర్బనలో ఎంపీపీఎస్ కేపీ పాఠశాలలో యూటీఎఫ్ అధ్యక్షుడు వీఎన.మాలింగప్ప, జిల్లా కార్యదర్శి కే భూతన్న ఆధ్వర్యంలో జగ్జీవనరామ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అంబేడ్కర్ కాలనీలో ఎస్టీయూ అధ్యక్షుడు ఆదినారాయణ, టీబీ నాగభూషణం, సీపీఐ రామాంజనేయులు, హనుమంతు, మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనఆర్ నరసింహులు మాదిగ, పరిగి మద్దిలేటి, ఎంఆర్ తిప్పేస్వామి ఎల్లోటి హనుమంతు, నారాయణబాబు, శంకరప్ప, గంగప్ప ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మడకశిర టౌనలో మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న ఆధ్వర్యంలో జగ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
అమరాపురంలో ఎంపీడీఓ మునిస్వామి, ఎంపీపీ ఈరన్న, జడ్పీటీసీ స్వారక్క నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో జగ్జీవనరామ్ జయంతి సందర్భంగా కేక్ కట్చేసి స్వీట్లు పంచారు. వైస్ ఎంపీపీలు క్రిష్ణమూర్తి, లలితమ్మ, సత్యనారాయణ పాల్గొన్నారు. అగళి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జిలానీ ఆధ్వర్యంలో జగ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అగళి, పీ బ్యాడిగెర, మ ధూడి గ్రామాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.