ఘనంగా బాలాలయ మహోత్సవాలు
ABN , First Publish Date - 2021-10-27T05:07:42+05:30 IST
గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి బాలాలయ మహోత్సవాలను మంగళవారం సహాయ కమిషనర్ అలవలపాటి ముకుం దరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కేసరి, ఉప అర్చకులు రాజారమేష్ అధ్య క్షతన ఘనంగా నిర్వహించారు.
చక్రాయపేట, అక్టోబరు 26: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారి బాలాలయ మహోత్సవాలను మంగళవారం సహాయ కమిషనర్ అలవలపాటి ముకుం దరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కేసరి, ఉప అర్చకులు రాజారమేష్ అధ్య క్షతన ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయాన్నే స్వామివారి కలశాలకు పాపాఘ్ని నదినీటితో హోమ కుంభ ఆవాహన నిర్వహించారు. నదిలో అర్చక స్వాములు గంగా పూజలు నిర్వహించి ఇత్తడి బిందెలతో జలాన్ని తెచ్చి స్వామివారి కలశాలకు తీర్థపూ రణం నిర్వహించారు. అహోబిలం ప్రధాన అర్చకులు రమేష్ స్వామి, ఆయన బృందం, గండి ఆలయ అర్చకులు కేసరిస్వామి, రాజాస్వామి, గోపాల స్వాములు హోమాది కార్యక్రమాలను నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
బద్వేలు ఎన్నికల పరిశీలకుడు మిచెల్ (ఐఏఎస్), శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి, ప్రముఖపారిశ్రామికవేత్త కందుల రాజమోహన్రెడ్డి, డ్వామా పీడీ యదుభూషణ్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు స్వామివారిని దర్శించుకున్నారు.