వైభవంగా నారసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-04-19T06:03:32+05:30 IST

మట్టపల్లి లక్ష్మీనృసింహుడి కల్యాణాన్ని వేద పండితులు ఆదివారం శాస్రోక్తంగా నిర్వహించారు.

వైభవంగా నారసింహుడి కల్యాణం
ఆలయ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు

మఠంపల్లి, ఏప్రిల్‌ 18: మట్టపల్లి లక్ష్మీనృసింహుడి కల్యాణాన్ని వేద పండితులు ఆదివారం శాస్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన, మాంగల్యధారణ తలంబ్రాలతో నిత్య కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు నీరాజనమంత్ర పుష్పాలతో మహానివేధన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా అంకరించిన రథంపై స్వామివారిని ఉంచి మహాక్షేత్రంలోని పుర వీధుల్లో ఊరే గించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో సరికొండ నవీన్‌కుమార్‌, అర్చకులు తూమాటిశ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తి, శేషగిరిరావు, గోవిందరెడ్డి, శ్రీనివాసరావు, సీత, రాజేష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T06:03:32+05:30 IST