వైభవంగా నృసింహుడి కల్యాణం
ABN , First Publish Date - 2021-12-06T06:37:02+05:30 IST
మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహుడి నిత్య కల్యాణాన్ని ఆర్చకులు ఆదివారం వైభవంగా నిర్వహించారు.
మఠంపల్లి, డిసెంబరు 1: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహుడి నిత్య కల్యాణాన్ని ఆర్చకులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పూజల అనంతరం స్వామి వారికి మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి చెన్నూరిమట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్ అర్చకులు తూమాటిశ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, , ఫణిభూషణమంగాచార్యులు పాల్గొన్నారు.
సీతారామచంద్రస్వామి శాంతి కల్యాణం
సూర్యాపేట కల్చరల్: సూర్యాపేటలోని శ్రీవేదాంత భజన మందిరం లో శ్రీసీతారామచంద్రస్వామి శాంతి కల్యాణాన్ని శనివారం రాత్రి నిర్వ హించారు. ఈ సందర్భంగా 1016 సహాస్త్ర దీపాలను వెలిగించి స్వామివారికి పవలింపు (ఉంజల్) సేవ నిర్వహించారుశ్రీఅన్నపూర్ణ సహిత విశ్వనాథస్వామి దేవాలయంలో ఆదివారం ఆకాశ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.