ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి

ABN , First Publish Date - 2021-01-21T05:44:20+05:30 IST

వర్గల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మనం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని బుధవారం నిర్వహించారు.

ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి
మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన మనం ఫౌండేషన్‌

వర్గల్‌, జనవరి 20 : వర్గల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మనం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 9 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సావిత్రిబాయి ఫూలే అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో వేలూర్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు కనకరాజు, మనం ఫౌండేషన్‌ చైర్మన్‌ సంపత్‌, కార్యదర్శి కనకయ్య, తదితరులు పాల్గోన్నారు. 

Updated Date - 2021-01-21T05:44:20+05:30 IST