ఎండదెబ్బ తగిలి ప్రధాని ఇంట్లో పడిన పక్షి.. కాపాడిన అధికారులు

ABN , First Publish Date - 2020-05-31T01:03:36+05:30 IST

దేశంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు, జంతువులు కూడా నానా ఇబ్బందులూ పడుతున్నాయి.

ఎండదెబ్బ తగిలి ప్రధాని ఇంట్లో పడిన పక్షి.. కాపాడిన అధికారులు

న్యూఢిల్లీ: దేశంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి మనుషులే కాదు, జంతువులు కూడా నానా ఇబ్బందులూ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో ఎగురుతున్న ఓ గ్లాసీ ఐబిస్(కొంగ జాతికి చెందిన ఓ పక్షి) ఎండ వేడి తట్టుకోలేక కింద పడిపోయింది. ఎక్కడో పడితే అలానే చనిపోయేదేమోగానీ, దాని అదృష్టం బావుండి ప్రధాని మోదీ ఇంట్లో పడింది. ప్రధాని నివాసంలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ఉన్న దీన్ని భద్రతా అధికారులు గమనించారు. ఈ విషయం తెలుసుకున్న నాన్ ప్రాఫిట్ సంస్థ.. వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ అధికారులు పక్షిని తమవెంట తీసుకెళ్లి సేదతీర్చారు. ఇప్పుడు అది ఎండదెబ్బ నుంచి కోలుకొంది. ఈ విషయాన్ని వెల్లడించిన వైల్డ్‌లైఫ్ ఎస్‌ఓఎస్ అధికారులు.. ప్రధాని నివాసంలోని అధికారుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-05-31T01:03:36+05:30 IST