జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీ విక్రయం నిలిపివేత

ABN , First Publish Date - 2020-05-22T07:02:37+05:30 IST

జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీలో నూరు శాతం వాటాను జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీకి విక్రయించే ప్రక్రియ నిలిచిపోయింది. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ పరిణామాలతో ఈ లావాదేవీ నిలిచిపోయిందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్...

జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీ విక్రయం నిలిపివేత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీలో నూరు శాతం వాటాను జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీకి విక్రయించే ప్రక్రియ నిలిచిపోయింది. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ పరిణామాలతో ఈ లావాదేవీ నిలిచిపోయిందని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తెలిపింది. మళ్లీ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీ (జీకేఈఎల్‌)లో వాటాను విక్రయిస్తున్నట్లు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. 


Updated Date - 2020-05-22T07:02:37+05:30 IST