‘జీవో 39 వెంటనే రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-05-26T21:28:33+05:30 IST

జీవో 39ని రద్దు చేయాలని బీజేపీ, జనసేన నేతలు డిమాండ్ చేశారు.

‘జీవో 39 వెంటనే రద్దు చేయాలి’

విశాఖ: దేవాలయాల భూములను ప్రభుత్వం పరిరక్షించాలని బీజేపీ, జనసేన నేతలు మంగళవారం విశాఖలో ఉపవాస దీక్షకు దిగారు. జీవో 39ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెండు పార్టీల నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ భక్తుల ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూసిందన్నారు. దేవాలయ భూముల పట్ల వైసీపీ ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిందని, ఎక్కడెక్కడ దేవాలయాల భూములు ఉన్నాయో వాటిని హౌసింగ్ సైట్స్‌గా వినియోగించుకోడానికి అనువుగా ఉన్నాయో లిస్టు తయారు చేయాలని చెప్పిందన్నారు. అప్పుడే తాము తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. ఎన్ని హెచ్చరికలు చేసిన వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-26T21:28:33+05:30 IST