రియల్టీలో పీఈ పెట్టుబడులకు గండి
ABN , First Publish Date - 2020-09-24T06:05:33+05:30 IST
స్థిరాస్తి (రియల్టీ) రంగంలో పెట్టుబడుల కొరత కొనసాగుతోంది. గతంలో పెట్టుబడులకు ఎగబడిన ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలూ ఇపుడు వేచి చూసే ధోరణి పాటిస్తున్నాయి.
న్యూఢిల్లీ: స్థిరాస్తి (రియల్టీ) రంగంలో పెట్టుబడుల కొరత కొనసాగుతోంది. గతంలో పెట్టుబడులకు ఎగబడిన ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలూ ఇపుడు వేచి చూసే ధోరణి పాటిస్తున్నాయి. ఆర్థిక మందగమనానికి తోడు, కోవిడ్ ఇందుకు కారణం. దీంతో ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో భారత స్థిరాస్తి రంగంలో పీఈ పెట్టుబడులు 85 శాతం పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంలో దేశ, విదేశీ పీఈ సంస్థ లు ఈ రంగంలో 579.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టా యి. ఈ సంవత్సరం జనవరి-ఆగస్టు మధ్య అది 86.6 కోట్ల డాలర్లకు (రూ.6,500 కోట్లు) పడిపోయింది. ఇందుకు సంబంధించి కొలియర్స్ ఇంటర్నేషనల్-ఫిక్కీ సంస్థలు సంయుక్తంగా ఒక నివేదిక విడుదల చేశాయి.